లేవీకాండం
గ్రంథకర్త
ఈ గ్రంథం చివరి వచనం రచయిత ఎవరనేది మనకు తెలుపుతున్నది. “ఇవి యెహోవా సీనాయి కొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు (27:34; 7:38; 25:1; 26:46). దేవుని చట్టాలకు సంబంధించిన అనేక చారిత్రక వివరాలను ఈ పుస్తకం నమోదు చేస్తున్నది (8-10; 24:10-23). లేవీకాండము అనే పేరు లేవి గోత్రం నుండి వచ్చింది. వీరిని దేవుడు తన యాజకులుగా, ఆరాధన నాయకులుగా ప్రత్యేక పరిచాడు. లేవీయుల బాధ్యతలు, మరింత ప్రధానంగా యాజకులకు సూచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వారు దైవారాధనలో ప్రజలకు సహాయపడవలసిన పద్ధతి. పవిత్ర జీవనం గురించి రాసి ఉంది.
రచనా కాలం, ప్రదేశం
ఇంచుమించు క్రీ. పూ 1446 - 1410
లేవీకాండంలో రాసి ఉన్న ధర్మశాస్త్రం దేవుడు మోషేకు సీనాయి కొండ వద్ద అందజేశాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల కొంత కాలం అక్కడ ఉన్నారు.
స్వీకర్త
ఈ గ్రంథాన్ని యాజకులకు, లేవీయులు, రానున్న ఇశ్రాయేల్ తరాలకు రాయడం జరిగింది.
ప్రయోజనం
ప్రత్యక్షగుడారం నిర్మించ వలసిందిగా దేవుడు మోషేను కోరడంతో లేవికాండం మొదలవుతుంది. ఇప్పుడు వారి మధ్య నివసిస్తున్న వారి మహిమాన్విత దేవునితో సరైన సహవాసం కొనసాగించడమెలాగో ఆ విముక్త ప్రజలకు ఈ గ్రంథం వివరంగా చెబుతున్నది. ఆ జాతి అప్పుడే ఈజిప్టును, దాని సంస్కృతిని, మతాలను విడిచి వచ్చింది. ఆ జాతి పై ప్రభావం చూపగల సంస్కృతులు, మతాలు ఉన్న కనాను దేశంలో ప్రవేశించనున్నది. ఆ సంస్కృతులకు వేరుగా (పరిశుద్ధంగా) యోహోవాకు నమ్మకంగా ఉండడానికి కావలసిన నియమాలను లేవీకాండం వర్ణిస్తున్నది.
ముఖ్యాంశం
బోధ, సూచనలు
విభాగాలు
1. అర్పణల గురించి ఆజ్ఞలు – 1:1-7:38
2. దేవుని యాజకుల గురించి ఆజ్ఞలు – 8:1-10:20
3. దేవుని ప్రజలకు ఆజ్ఞలు – 11:1-15:33
4. బలిపీఠం, ప్రాయశ్చిత్త దినం గురించిన ఆజ్ఞలు – 16:1-34
5. ఆచరణాత్మక పవిత్రత – 17:1-22:33
6. విశ్రాంతి దినాలు, పండుగలు, ఉత్సవాలు – 23:1-25:55
7. దేవుని దీవెన పొందాలంటే షరతులు – 26:1-27:34
